ఏసీబీ వలలో విద్యుత్తు డీఈ
ABN , First Publish Date - 2021-04-16T09:11:20+05:30 IST
విద్యుత్తు శాఖలోని ఒక అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మింట్కాంపౌండ్లోని కమర్షియల్ విభాగంలో గజవాడ మనోహర్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు శాఖలోని ఒక అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మింట్కాంపౌండ్లోని కమర్షియల్ విభాగంలో గజవాడ మనోహర్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బీబీనగర్లో 5కిలోవాట్ల ఎల్టీ కేటగిరీ-2 పనులకు అనుమతులు మంజూరు నిమిత్తం కాంట్రాక్టరు నుంచి రూ.35వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనల మేరకు.. గురువారం మింట్ కాంపౌండ్లోని కార్యాలయంలో డీఈకి కాంట్రాక్టరు లంచం సొమ్ము ఇచ్చారు. అక్కడే వేచివున్న ఏసీబీ అధికారులు.. డీఈని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.