తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కట్
ABN , First Publish Date - 2021-07-24T05:08:28+05:30 IST
గుర్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
గుర్ల: గుర్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపేశారు. రూ.4,40,000 మేర విద్యుత్ బకాయిలు ఉన్నట్లు ట్రాన్స్కో ఏఈ ప్రసాదరావు తెలిపారు. దాదాపు నాలుగేళ్లుగా కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని చెప్పారు. పలుమార్లు నోటీ సులు జారీ చేసినా స్పందన లేదన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు.