విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2020-11-29T05:11:08+05:30 IST
జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావంతో ఆగిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ సీఈ సుబ్బరాజు జిల్లా అధికారులన ఆదేశించారు.
సీఈ సుబ్బరాజు
నెల్లూరు(జడ్పీ), నవంబరు 28 : జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావంతో ఆగిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ సీఈ సుబ్బరాజు జిల్లా అధికారులన ఆదేశించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఆత్మకూరు, గూడూరు డివిజన్లలో పర్యటించారు. అనంతరం ఎస్ఈ విజయ్కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లకు, తాగునీటి వనరులకు సరఫరాలో అధిక ప్రాధాన్యం ఉండాలని సూచించారు.