విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-11-29T05:11:08+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆగిపోయిన విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్‌ శాఖ సీఈ సుబ్బరాజు జిల్లా అధికారులన ఆదేశించారు.

విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి
ఎస్‌ఈతో చర్చిస్తున్న సీఈ సుబ్బరాజు

 సీఈ సుబ్బరాజు 

నెల్లూరు(జడ్పీ), నవంబరు 28 : జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో  ఆగిపోయిన విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్‌ శాఖ సీఈ సుబ్బరాజు జిల్లా అధికారులన ఆదేశించారు. శనివారం  జిల్లాకు  వచ్చిన ఆయన ఆత్మకూరు, గూడూరు డివిజన్లలో పర్యటించారు. అనంతరం ఎస్‌ఈ విజయ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లకు, తాగునీటి వనరులకు సరఫరాలో అధిక ప్రాధాన్యం ఉండాలని సూచించారు.

Updated Date - 2020-11-29T05:11:08+05:30 IST