విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-19T06:03:11+05:30 IST

విద్యుదాఘాతానికి గురై తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

డోన్‌(రూరల్‌), జనవరి 18: విద్యుదాఘాతానికి గురై తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం మండలంలోని చిన్న మల్కాపురం గ్రామంలో చోటు  చేసుకుంది. డోన్‌ పట్టణం రెవెన్యూ క్వార్టర్స్‌ వెనుక వీధిలో ఉంటున్న మహమ్మద్‌ రఫీ గౌండా పని చేసేవాడు. సోమవారం చిన్న మల్కాపురంలో ఓ ఇంటి మీద చుట్టూ గోడ నిర్మాణ పనుల్లో ఉండగా విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో కుమారుడు సుభాన్‌ తండ్రిని రక్షించబోయి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సుభాన్‌ను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. 

Updated Date - 2021-01-19T06:03:11+05:30 IST