విద్యుత్ స్తంభంపై ఎగిసిన మంటలు
ABN , First Publish Date - 2022-05-25T18:44:24+05:30 IST
మణుగూరు పట్టణంలోని అశోక్నగర్ ప్రాంతంలోని ఓ విద్యుత్ స్తంభంపై బుధవారం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు పట్టణంలోని అశోక్నగర్ ప్రాంతంలోని ఓ విద్యుత్ స్తంభంపై బుధవారం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విద్యుదా ఘాతం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ఏడీఈ జీవన్ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా విద్యుత్ స్తంభంపై ఉన్న ఓ ఇంటి సర్వీస్ వైర్ కారణంగా విద్యుదాఘాతం ఏర్పడిందన్నారు. సమాచారం తెలియగానే సిబ్బంది సమస్యను పరిష్కరించారని వివరించారు.