రెండు ఎక్స్‌ప్రెస్‌లకు విద్యుత లోకోలు

ABN , First Publish Date - 2022-01-29T05:44:56+05:30 IST

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు డీజిల్‌ లోకోల స్థానంలో విద్యుత లోకోమోటివ్‌లను రీప్లేస్‌ చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు

రెండు ఎక్స్‌ప్రెస్‌లకు విద్యుత లోకోలు

గుంతకల్లు, జనవరి 28: గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు డీజిల్‌ లోకోల స్థానంలో విద్యుత లోకోమోటివ్‌లను రీప్లేస్‌ చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. బసవ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 17307/08), షోలాపూర్‌-హసన-షోలాపూర్‌ (నెం. 11311/12) ఎక్స్‌ప్రెస్‌లకు రైలింజన్లను మార్చామని అన్నారు. దశ ల వారీగా డీజిల్‌ ఇంజన్ల స్థానంలో విద్యుత లోకోలను రీ ప్లేస్‌ చేస్తున్నామని తెలిపారు. ఎలెకి్ట్రక్‌ లోకో మోటివ్‌ల ఏర్పాటువల్ల రైళ్ల వేగం పెరగటంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని, ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

Updated Date - 2022-01-29T05:44:56+05:30 IST