-
-
Home » Andhra Pradesh » Elections will fly the yellow flag anytime Kotla Surya Prakash Reddy-MRGS-AndhraPradesh
-
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పసుపు జెండా ఎగరేస్తాం : కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి
ABN , First Publish Date - 2022-05-02T23:43:15+05:30 IST
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగుర వేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి తెలిపారు.
కర్నూలు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగుర వేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మిగనూరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సూర్య ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో పథకాలన్నీ సంక్షేమంగా... జగన్ హయంలో పథకాలన్నీ సంక్షోభంగా మారాయన్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ అడపిల్లలకు పెళ్లి కానుక ఆర్థిక సాయంగా అందిస్తే జగన్ వాటిని రద్దు చేశారని కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు.