ఎన్నికలు బాధ్యతగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-02T06:35:02+05:30 IST
జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్ సూచించారు.
మండల పరిషత్ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్
అనకాపల్లి, మార్చి 1: జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్ సూచించారు. స్థానిక రావుగోపాలరావు స్టేడియం, రోటరీ కల్యాణ మండపంలో జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంఈవో దివాకర్, రిసోర్స్పర్సన్లు కుంచునాయుడు, దివాకర్ ఎన్నికల నియమావళిని వివరించారు.