ఎన్నికలు బాధ్యతగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-02T06:35:02+05:30 IST

జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌ సూచించారు.

ఎన్నికలు బాధ్యతగా నిర్వహించాలి
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సత్య శ్రీనివాస్‌

మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌


అనకాపల్లి, మార్చి 1: జీవీఎంసీ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని మండల పరిషత్‌ పరిపాలనాధికారి సత్యశ్రీనివాస్‌ సూచించారు. స్థానిక రావుగోపాలరావు స్టేడియం, రోటరీ కల్యాణ మండపంలో జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది, పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంఈవో దివాకర్‌, రిసోర్స్‌పర్సన్‌లు కుంచునాయుడు, దివాకర్‌ ఎన్నికల నియమావళిని వివరించారు.

Updated Date - 2021-03-02T06:35:02+05:30 IST