ఖాళీ స్థానాలకు ఎన్నికలు
ABN , First Publish Date - 2022-05-10T06:03:03+05:30 IST
మండలంలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
గాంధారి, మే 9: మండలంలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మొత్తం 10 గ్రామాలలో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గౌరారం కళాన్ (సర్పంచ్), జువ్వాడి (సర్పంచ్), గండివేట్ తండా (వార్డుమెంబర్), గోల్లడితండా (వార్డుమెంబర్), గండివేట్ తండా (వార్డుమెంబర్), గౌరారం కలాన్ (వార్డుమెంబర్), ముదోలీ (వార్డుమెంబర్), పర్మల్తండా (వార్డుమెంబర్), పోతంగల్ కుర్ధు (వార్డుమెంబర్), తిప్పారం (వార్డుమెంబర్), తిప్పారం తండా (వార్డుమెంబర్) స్థానాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
నాగిరెడ్డిపేట: మండలంలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వాహణకు పోలింగ్ బూతులను సిద్ధం చేసినట్లు ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్లు తెలిపారు. ఎంపీడీవో నోటీస్ బోర్డుపైన సోమవారం పోలింగ్ బూత్ల వివరాలు ప్రకటించారు. నాగిరెడ్డిపేట మండలంలో ధర్మారెడ్డి ఎంపీటీసీ స్థానానికి, పల్లె బొగడ తండా సర్పంచ్ స్థానానికి, మరో నాలుగు వార్డు సభ్యుల స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల నిర్వాహణ కోసం 10 పోలింగ్ బూత్లను సిద్ధంగా ఉంచినట్లు వారు తెలిపారు.