రెండు పంచాయతీ, 53 వార్డులకు ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలతో పాటు మరో 53 వార్డులకు ఎన్నికలు ఈనెల 15న జరగనున్నాయి.

రెండు పంచాయతీ, 53 వార్డులకు ఎన్నికలు

నేటి నుంచి నామినేషన్లు

కడప, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలతో పాటు మరో 53 వార్డులకు ఎన్నికలు ఈనెల 15న జరగనున్నాయి. గత నెలలో జరిగిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ, వార్డు స్థానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలోని కొండాపురం మండలం సుగుమంచిపల్లె, వేముల మండలంలోని వెలమవారిపల్లె పంచాయతీ స్థానాలతో పాటు మరో 53 వార్డులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి 6వతేదీ వరకు నామినేషన నిర్వహిస్తున్నారు. 7న పరిశీలన, 10న ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 3గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 15న ఎన్నికలు నిర్వహించి అదే రోజు విజేతలను ప్రకటిస్తారు.

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST