మిగిలిపోయిన పురాలకూ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-04-11T09:18:27+05:30 IST

రాష్ట్రంలో మిగిలిపోయిన పురపాలక సంఘాలకూ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పురపాలక శాఖ భావిస్తోంది.

మిగిలిపోయిన పురాలకూ ఎన్నికలు

వార్డుల రిజర్వేషన్ల ఖరారులో అధికారులు


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మిగిలిపోయిన పురపాలక సంఘాలకూ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పురపాలక శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా ఆయా నగర, పుర పాలక సంఘాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే యత్నాలను అధికారులు ప్రారంభించారు. రాష్ట్రంలోని 87 నగర, పురపాలక సంఘాలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, అనివార్య కారణాల వల్ల 38 చోట్ల ఎన్నికలు జరగలేదు. అక్కడా వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది.


ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లాలోని గుడివాడ, వైఎస్సార్‌ తాడిగడప, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల సంఖ్యను నిర్ధారించుకునేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాల్సిందిగా ఆయా మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని నెలాఖర్లోగా పూర్తి చేయాలి. 

Updated Date - 2021-04-11T09:18:27+05:30 IST