ఎన్నికల్లో పోటీకి 10 మందిపై నిషేధం
ABN , First Publish Date - 2022-06-19T14:09:05+05:30 IST
ఎన్నికల ఖర్చులు సమర్పించని 10 మందిపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. వారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల్లో
ఐసిఎఫ్(చెన్నై), జూన్ 18: ఎన్నికల ఖర్చులు సమర్పించని 10 మందిపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. వారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన 10 మంది ఇప్పటివరకు ఖర్చులు సమర్పించకుండా ఉండడంతో రామనాధపురం జిల్లా ముదుకుళత్తోర్ నియోజకవర్గంలో నలుగురు, రామనాధపురం నియోజకవర్గంలో ఒకరు, పరమకుడి (రిజర్వ్డ్) నియోజకవర్గంలో ముగ్గురు, వేలూరు శాసనసభ నియోజకవర్గంలో ఇద్దరు అని మొత్తం 10 మంది మూడేళ్లు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది.