ఎన్నికల విధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-24T06:35:45+05:30 IST

ఎన్నికల విధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో నాతి బుజ్జి, తహశీల్దార్‌ రామకృష్ణ అన్నారు.

ఎన్నికల విధులపై అప్రమత్తంగా ఉండాలి

ఆత్రేయపురం, జనజరి 23: ఎన్నికల విధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో నాతి బుజ్జి, తహశీల్దార్‌ రామకృష్ణ అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌ ఎన్నికలపై స్టేజ్‌-1 ఎన్నికల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం మొదటిదశలో అమలాపురం డివిజన్‌లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాను వార్డుల వారీగా విభజించాలని సిబ్బందికి సూచించారు. ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌, ఎంఈవో వరప్రసాదరావు, స్టేజ్‌-1 అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-24T06:35:45+05:30 IST