రెవెన్యూ డివిజన ఉద్యోగుల అసోసియేషన కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2021-07-26T06:09:42+05:30 IST

ధర్మవరం రెవెన్యూ డివిజన ఉద్యోగుల అసోసియేషన నూతన కార్యవర్గాన్ని ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రెవెన్యూ డివిజన ఉద్యోగుల అసోసియేషన కమిటీ ఎన్నిక

ధర్మవరం, జూలై 25: ధర్మవరం రెవెన్యూ డివిజన ఉద్యోగుల అసోసియేషన నూతన కార్యవర్గాన్ని ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం 3 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ కమిటీ అధ్యక్షులుగా జి.నారాయణస్వామి (తహసీ ల్దార్‌, రామగిరి), అసోసియేట్‌ ప్రసిడెంట్‌గా మురళీకృష్ణ తహసీల్దార్‌ (కనగానపల్లి), ఉపాధ్యక్షుడిగా జి.ప్రసన్నకుమార్‌ డిప్యూటీ తహసీల్దార్‌, సీకేపల్లి, డీ రామకృష్ణ డిప్యూటీ తహసీల్దార్‌, ముదిగుబ్బ, జీ లక్ష్మీదేవి సీఎస్‌డీటీ సీకేపల్లి, కార్యదర్శిగా హెచఎం యశ్వంత, ఎంఆర్‌ఐ-1, (తా డిమర్రి తహసీల్దార్‌ కార్యాలయం), ఆర్గనైజజింగ్‌ సెక్రటరీ దివాకర్‌రెడ్డి, ఎంఆర్‌ఐ-1,(రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయం) జాయింట్‌ సెక్రట రీలుగా ఎం.షణ్ముఖ కుమార్‌ యాదవ్‌, ఎంఆర్‌ఐ-2, (కనగానపల్లి, తహసీల్దార్‌ కార్యాలయం), బీ తిరుపాల్‌, డ్రైవర్‌ (ధర్మవరం ఆర్డీఓ కా ర్యాలయం), కోశాధికారి ఎం.చక్రపాణి, ఎంఆర్‌ఐ(బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం)లను ఎన్నుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ డివిజన ఉద్యో గుల సమస్యలపై, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషిచే స్తామని నూతనకమిటీ ప్రతినిధులు తెలిపారు.

  కదిరిఅర్బన: కదిరి రెవెన్యూ డివిజన ఉద్యోగుల అసోసియేషన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రెసిడెంట్‌ వెంకటరెడ్డి తెలి పారు. ఆంధ్రప్రదేశ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన పిలుపు మేరకు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. కదిరి రెవెన్యూ డివిజన ప్రెసిడెంట్‌గా వెంకటరెడ్డి (ఇనచార్జి తహసీల్దార్‌, కొత్తచెరువు, అసోసియేషన ప్రెసిడెంట్‌గా శ్రీధర్‌ ( డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌డీఓ కార్యాలయం కదిరి), వైస్‌ ప్రెసిడెంట్‌లుగా బాబురావు (డిప్యూటీ తహసీల్దార్‌ స్టాక్‌పాయింట్‌ గాండ్లపెంట), ఎస్‌ మున్వర్‌బాషా (మండల రెవెన్యూ ఇన్సపెక్టర్‌, కదిరి), ఎంఎస్‌ మల్లికార్జున ( మండల రెవెన్యూ ఇన్సపెక్టర్‌, తనకల్లు), సెక్రటరీగా పీ శ్రీనివాసరెడ్డి (డిప్యూటీ తహసీల్దార్‌, గాండ్లపెంట ), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎస్‌ నాగేంద్ర (మండల రెవెన్యూ ఇన్సపెక్టర్‌, ఓడీచెరువు), జాయింట్‌ సెక్రటరీలుగా ఎస్‌ రవిప్రకాశరావు (జూనియర్‌ సహాయకులు అమడ గూరు), ఎం నందిని (మండల రెవెన్యూఇన్సపెక్టర్‌ నల్లచెరువు), కే గంగన్న (అటెండర్‌, ఆర్డీఓ కార్యాలయం, కదిరి ), కోశాధికారిగా రవి ప్రకాశరావు (డిప్యూటీ తహసీల్దార్‌, స్టాక్‌ పాయింట్‌, ఓడీచెరువు )లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2021-07-26T06:09:42+05:30 IST