Electioin Commission : రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-06-15T20:09:39+05:30 IST

భారత దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 16వ రాష్ట్రపతి

Electioin Commission : రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ : భారత దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 29 వరకు ఉంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు వచ్చే నెల 2. 


అవసరమైతే పోలింగ్ వచ్చే నెల 18న జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది. 


రహస్య బ్యాలట్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు హౌస్, రాష్ట్రాల శాసన సభల్లో పోలింగ్ జరుగుతుంది. 


ఈ ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు. మొత్తం ఓట్ల విలువ 10,86,431. 


Updated Date - 2022-06-15T20:09:39+05:30 IST