నాయకుల విగ్రహాలకు ముసుగులు
ABN , First Publish Date - 2021-01-27T04:22:17+05:30 IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో కోడ్ అమలులోకి వచ్చింది.
మొగల్తూరు, జనవరి 26: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో కోడ్ అమలులోకి వచ్చింది. మొగ ల్తూరు పంచాయతీ పరిధిలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొల గించడంతో పాటు జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్నారు. రేషన్ బియ్యం సరఫరా వాహనాలపై ముఖ్యమంత్రి ఫొటో ఉన్నందున వాహనాలకు ముసుగు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.