Linkage: ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానం

ABN , First Publish Date - 2022-08-20T16:07:46+05:30 IST

ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌ నెంబరు అనుసంధానంపై ప్రజల నుండి స్పందన వచ్చిందని, ఇప్పటివరకు 37.81 లక్షల మంది నమోదు చేసుకున్నార

Linkage: ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానం

                                        - 37.81 లక్షల మంది నమోదు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 19: ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌ నెంబరు అనుసంధానంపై ప్రజల నుండి స్పందన వచ్చిందని, ఇప్పటివరకు 37.81 లక్షల మంది నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో రాష్ట్రంలో ఈ పనులు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆయా పోలింగ్‌ కేంద్రాల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ నెంబర్లు సేకరిస్తుండగా, ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఆధార్‌ నెంబరు అప్‌లోడ్‌ చేసే పనులను ఈసీ కల్పించింది. ఆ ప్రకారం www.nvsp.in అనే వెబ్‏సైట్, Voter Help Line అనే యాప్‌ ద్వారా ఓటర్లు తమ ఆధార్‌ నెంబర్లను నమోదుచేసుకోవచ్చు. ఈ విషయమై ఎన్నికల కమిషనర్‌ సత్యప్రదసాహు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 37,81,498 మంది ఓటర్లు ఆధార్‌ నెంబరు నమోదుచేసుకున్నారని తెలిపారు. వారిలో 90 శాతం మంది పోలింగ్‌ అధికారుల వద్ద, 10 శాతం మంది ఆన్‌లైన్‌ ద్వారా నమోదుచేసుకున్నారని, మొత్తం ఓటర్లలో నమోదుచేసుకున్న వారి సంఖ్య 6.08 శాతంగా ఉందని తెలిపారు. 

Updated Date - 2022-08-20T16:07:46+05:30 IST