పోలింగ్‌ సామగ్రి కొనుగోలు బిల్లులకు చెల్లింపులు

ABN , First Publish Date - 2021-04-17T06:58:40+05:30 IST

శనివారం జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం సామగ్రి కొనుగోలు చేసిన బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తూ చీఫ్‌ ఎలొక్టరల్‌ అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్‌ సామగ్రి కొనుగోలు బిల్లులకు చెల్లింపులు

కలికిరి, ఏప్రిల్‌ 16: శనివారం జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం సామగ్రి కొనుగోలు చేసిన బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తూ చీఫ్‌ ఎలొక్టరల్‌ అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం 10 సీసీ పరిమాణం కలిగిన 6450 ఇండెలిబుల్‌ ఇంక్‌ సీసాలు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.11,59,760ల చెల్లింపులకు అనుమతించారు. ఇక ఈవీఎం యంత్రాలకు అవసరమైన 4,600 పవర్‌ ప్యాక్‌లు (బ్యాటరీలు), వీవీప్యాట్‌ల భద్రత కోసం ఉపయోగించేందుకు ఐదు వేల థర్మల్‌ పేపర్‌ రోల్స్‌ను కొనుగోలు చేశారు. వీటి కోసం మొత్తం రూ. 34,83,360లు చెల్లించేందుకు అనుమతించారు. ఈ మొత్తాలను గురువారం ఎన్నికల వ్యయం కోసం విడుదల చేసిన నిధుల నుంచి చెల్లింపులు జరిపేందుకు అనుమతించారు. 

Updated Date - 2021-04-17T06:58:40+05:30 IST