పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి
ABN , First Publish Date - 2021-01-25T06:06:34+05:30 IST
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు కోరారు.
ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్
గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు కోరారు. గుంటూరు జడ్పీ ఆవరణలోని అసోసియేషన్ కా ర్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్, జె.పూర్ణచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. కరోనా వాక్సిన్ పూర్తయిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొంటే మూడు లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతారని అన్నారు. సమావేశంలో అసోసియేషన్ నేతలు కూచిపూడి మోహనరావు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.