సాగర్ కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-09-18T01:32:51+05:30 IST
జిల్లాలో ప్రవహిస్తున్న సాగర్ కాలువలో దూకి ఓ వృద్ధుడు
ఖమ్మం: జిల్లాలో ప్రవహిస్తున్న సాగర్ కాలువలో దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామం వద్ద సాగర్ కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన దొంతు వెంకటేశ్వరరావు(63)గా పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా వృద్ధుడు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నాడు. వాటిని తట్టుకొలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.