జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు: టీజీ

ABN , First Publish Date - 2020-05-23T23:27:42+05:30 IST

జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆక్షేపించారు. ఎవరికీ నష్టం కలిగించని ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు.

జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు: టీజీ

కర్నూలు: జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆక్షేపించారు. ఎవరికీ నష్టం కలిగించని ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. సీమకు ఏమన్నా చేయాలని, అనుకున్నవారిపై బండలు వేస్తున్నారని, కర్ణాటకలో మన ప్రయోజనాలకు గండికొట్టినా పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో లిఫ్ట్ ద్వారా సాగునీరు ఇస్తామంటే.. వచ్చేవా సచ్చేవా అన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరిస్తామంటే విమర్శించారని, పోలవరం ఇప్పటికీ పూర్తికాలేదని టీజీ వెంకటేష్ చెప్పారు.

Updated Date - 2020-05-23T23:27:42+05:30 IST