Ts Assembly Speaker: పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా
ABN , First Publish Date - 2022-08-17T03:02:33+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. జలుబు..
హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy)కి కరోనా సోకింది. జలుబు (Cold), జ్వరం (Fever) లక్షణాలు ఉండటంతో ఆయన కొవిడ్ టెస్ట్ (Covid Test) చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పోచారంకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. దీంతో పోచారం హోం ఐసోలేషన్ (Home Isolation)లో ఉండనున్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన.. సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏమైనా లక్షణాలు ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు.