మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-07-06T05:06:05+05:30 IST
మదనపల్లెలో నిర్వహించ నున్న మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్రోడ్డు పక్కన ప్రత్యేకంగా నిర్మించిన వేదిక, ఎదురుగా వీఐపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల కూర్చు నేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
మదనపల్లె టౌన్, జూలై 5: మదనపల్లెలో నిర్వహించ నున్న మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్రోడ్డు పక్కన ప్రత్యేకంగా నిర్మించిన వేదిక, ఎదురుగా వీఐపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల కూర్చు నేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చి నా తడవకుండా వేదిక పైకప్పు వేస్తున్నారు. ఉదయం నుంచి సభాస్థలి వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్.శ్రీని వాసులురెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చిన బాబు, మదనపల్లె, తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జిలు దొమ్మలపాటి రమేశ్, శంకర్యాదవ్ పనులు పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, డీఎస్పీ రవిమనోహరాచారి సభాస్థలి వద్ద బందో బస్తు, సెక్యూరిటి ఏర్పాట్లు పరిశీలించి, నిర్వాహకులకు సూచనలిచ్చారు.
ఫ్లెక్సీలతో నిండిపోయిన మదనపల్లె
మినీమహానాడు సందర్భంగా మదనపల్లెకు రానున్న చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతూ కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయగా, కర్ణాటక సరిహద్దు చీకిలబైలు చెక్పోస్టు నుంచి పెద్తఎత్తున బ్యానర్లు కట్టారు. నక్కల దిన్నె నుంచి అనీబి సంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె, అన్నమ య్య సర్కిల్, బైపాస్ రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లతో నింపేశారు. సభాస్థలి వద్ద చినబాబు ఆధ్వర్యంలో ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేశారు. మంగళ వారం సాయత్రం ఏకదాటిగా వర్షం కురవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
మినీమహానాడు విజయవంతం తథ్యం
మదనపల్లెలో నిర్వహించనున్న మినీమహానాడుకు వాతావరణం అనుకూలిస్తుందని మాజీ మంత్రి అమర నాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లారి కిశోర్తో పాటు సభాస్థలి వద్దకు వచ్చిన ఆయన మాట్లాడారు. రాటకొండ బాబురెడ్డి, శ్రీరామనేని జయరామనాయుడు, బోడెపాటి శ్రీనివాస్, మార్పురి సుధాకర్నాయుడు, ఎస్ఏ మస్తాన్, డీఆర్ తులసినాయుడు, రాటకొండ గుర్రప్పనా యుడు, నాదెళ్ల విద్యాసాగర్, దొరస్వామినాయుడు, సురేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.5 ఎంపీఎల్టీ2: మినీమహానాడుకు వెళ్లే దారిలో ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు
మదనపల్లె టౌన్, జూలై 5: మదనపల్లెలో నిర్వహించ నున్న మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్రోడ్డు పక్కన ప్రత్యేకంగా నిర్మించిన వేదిక, ఎదురుగా వీఐపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల కూర్చు నేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చి నా తడవకుండా వేదిక పైకప్పు వేస్తున్నారు. ఉదయం నుంచి సభాస్థలి వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్.శ్రీని వాసులురెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చిన బాబు, మదనపల్లె, తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జిలు దొమ్మలపాటి రమేశ్, శంకర్యాదవ్ పనులు పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, డీఎస్పీ రవిమనోహరాచారి సభాస్థలి వద్ద బందో బస్తు, సెక్యూరిటి ఏర్పాట్లు పరిశీలించి, నిర్వాహకులకు సూచనలిచ్చారు.
ఫ్లెక్సీలతో నిండిపోయిన మదనపల్లె
మినీమహానాడు సందర్భంగా మదనపల్లెకు రానున్న చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతూ కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయగా, కర్ణాటక సరిహద్దు చీకిలబైలు చెక్పోస్టు నుంచి పెద్తఎత్తున బ్యానర్లు కట్టారు. నక్కల దిన్నె నుంచి అనీబి సంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె, అన్నమ య్య సర్కిల్, బైపాస్ రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లతో నింపేశారు. సభాస్థలి వద్ద చినబాబు ఆధ్వర్యంలో ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేశారు. మంగళ వారం సాయత్రం ఏకదాటిగా వర్షం కురవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
మినీమహానాడు విజయవంతం తథ్యం
మదనపల్లెలో నిర్వహించనున్న మినీమహానాడుకు వాతావరణం అనుకూలిస్తుందని మాజీ మంత్రి అమర నాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లారి కిశోర్తో పాటు సభాస్థలి వద్దకు వచ్చిన ఆయన మాట్లాడారు. రాటకొండ బాబురెడ్డి, శ్రీరామనేని జయరామనాయుడు, బోడెపాటి శ్రీనివాస్, మార్పురి సుధాకర్నాయుడు, ఎస్ఏ మస్తాన్, డీఆర్ తులసినాయుడు, రాటకొండ గుర్రప్పనా యుడు, నాదెళ్ల విద్యాసాగర్, దొరస్వామినాయుడు, సురేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.