HYD : త్వరలో ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’
ABN , First Publish Date - 2021-10-15T12:42:37+05:30 IST
సండే ఫన్డే తరహాలో ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ నిర్వహణకు
హైదరాబాద్ సిటీ : సండే ఫన్డే తరహాలో ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాహనాలను దారి మళ్లించి ట్యాంక్బండ్పై నిర్వహిస్తున్న తరహాలోనే చార్మినార్ వద్దా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి కేటీఆర్ సూచించారు. దాంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, స్పెషల్ సీఎస్ అర్వింద్కుమార్, సీపీ అంజనీకుమార్ గురువారం చార్మినార్ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే ఆదివారం నుంచే ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.