పాముకాటుతో ఎనిమిదేళ్ల బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-05-23T05:27:18+05:30 IST

పాముకాటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని కొండాపూర్‌ హనుమాన్‌ తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పాముకాటుతో ఎనిమిదేళ్ల బాలుడి మృతి

  కొండాపూర్‌ హనుమాన్‌ తండాలో ఘటన


నారాయణఖేడ్‌, మే 22: పాముకాటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని కొండాపూర్‌ హనుమాన్‌ తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తండావాసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌ తండాకు చెందిన నారాయణ, చిట్టిబాయి దంపతుల కుమారుడు పవన్‌(8) తండాలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి, కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారు జామున బాలుడు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచి ఏడుస్తున్నాడు. కుటుంబీకులు ఇంట్లో గమనించగా పాము కనిపించడంతో చంపేశారు. అనంతరం బాలుడ్ని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. కాగా తండాలో పారిశుధ్యం లోపించడంతో పాములు సంచరిస్తున్నాయని తండా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.


 

Updated Date - 2022-05-23T05:27:18+05:30 IST