చైనా బొగ్గుగనిలో ఘోర ప్రమాదం..18 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-05T17:55:43+05:30 IST

చైనా దేశంలోని బొగ్గుగనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది పిల్లలు మరణించారు....

చైనా బొగ్గుగనిలో ఘోర ప్రమాదం..18 మంది దుర్మరణం

బీజింగ్ (చైనా): చైనా దేశంలోని బొగ్గుగనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది కార్మికులు మరణించారు. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్ కింగ్ లోని గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది కార్మికులు మరణించారని చైనా అధికారిక వార్తాసంస్థ శనివారం తెలిపింది. డయాషుయిడాంగ్ బొగ్గు గనిలో అధిక స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటంతో శ్రామికులు మరణించారు. రెండు నెలల్లో బొగ్గుగనిలో రెండో ప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన బొగ్గుగనులున్న చైనాలోని చాంగ్కింగ్ సాంగ్జావో బొగ్గుగనిలో సెప్టెంబరులో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. 

Updated Date - 2020-12-05T17:55:43+05:30 IST