ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి...30 మంది మృతి

ABN , First Publish Date - 2020-10-25T11:31:19+05:30 IST

ఆప్ఘనిస్థాన్ దేశంలోని ఓ విద్యాసంస్థ బయట జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది ...

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి...30 మంది మృతి

కాబుల్ (ఆప్ఘనిస్థాన్) : ఆప్ఘనిస్థాన్ దేశంలోని ఓ విద్యాసంస్థ బయట జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మరణించారు. పశ్చిమ కాబుల్ నరగరంలోని దస్తే బార్చీ పులే ఖోషక్ ప్రాంతంలోని విద్యాసంస్థ ముందు ఆత్మాహుతి  బాంబరు దాడి ఘటనలో 30 మంది మరణించగా మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి బాంబరు విద్యాసంస్థ బయట డిటనేటర్లు, మందుగుండు సామాగ్రితో పేల్చుకున్నాడని ఆప్ఘనిస్థాన్ అంతర్గత శాఖ మంత్రి చెప్పారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కవసర్ విద్యాకేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించాడని ప్రత్యక్ష సాక్షులు  చెప్పారు. ఆత్మాహుతి దాడి జరిగినపుడు 12 మంది విద్యార్థులున్నారని, వారిలో కొందరు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి ఘటనను ఆప్ఘనిస్థాన్ హై కౌన్సిల్ అబ్దుల్లా ఖండించారు. ఆత్మాహుతి దాడులు ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకమని, అమానవీయమని అబ్దుల్లా పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-25T11:31:19+05:30 IST