గుజరాత్‌: గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది దుర్మరణం!

ABN , First Publish Date - 2021-08-09T16:00:01+05:30 IST

గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో...

గుజరాత్‌: గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది దుర్మరణం!

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక ట్రక్కు రోడ్డు పక్కన గుడిసెలోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో గుడిసెలో నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు సావర్ కుండలా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


ఘటన జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం  ప్రమాదానికి కారణమైన ట్రక్కు మహువా వైపు వెళుతోంది. బాద్ధా గ్రామం సమీపంలోకి రాగానే ట్రక్కు అదుపుతప్పి, ఒక గుడిసెలోకి దూసుకెళ్లి,  తరువాత 8 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

Updated Date - 2021-08-09T16:00:01+05:30 IST