ఎనిమిది మంది పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-08-11T08:03:00+05:30 IST

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన ప్రమాద ఘటనలో గాయపడిన ప్రయాణికుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానం లోయలోకి జారిపడి రెండు ముక్కలు కాగానే...

ఎనిమిది మంది పరిస్థితి విషమం


  • కోజికోడ్‌ ఘటనలో చికిత్సపొందుతున్న 101 మంది
  • మృతిచెందిన ప్రయాణికుడికి ‘పాజిటివ్‌’

మలప్పురం, ఆగస్టు 10: కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన ప్రమాద ఘటనలో గాయపడిన ప్రయాణికుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానం లోయలోకి జారిపడి రెండు ముక్కలు కాగానే 19 మంది మృతిచెందగా, గాయపడిన 172 మంది మలప్పురం, కోజికోడ్‌లలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సపొందారు. వారిలో 71 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. ఇంకా చికిత్సపొందుతున్న మిగతా 101 మందిలో ఎనిమిది మంది ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు ఇక ఈ ప్రమాదంలో మృతిచెందిన ఓ వ్యక్తి (45)కి కరోనా ఉందని శవపరీక్షల్లో తేలింది. ఆయనను మలప్పురం వాసిగా గుర్తించారు.    


Updated Date - 2020-08-11T08:03:00+05:30 IST