మరో ఎనిమిది మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-03T10:30:07+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందకు చేరువైంది. గురువారం ఒక్క రోజే ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది.
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
ఖమ్మంసంక్షేమవిభాగం, జూలై 2: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందకు చేరువైంది. గురువారం ఒక్క రోజే ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 96కు చేరింది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ సమాచారం మేరకు గురువారం పాజిటివ్ నిర్ధారణ అయిన వారి వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని ఇద్దరు మహిళా డాక్టర్లతో పాటు మరో స్టాఫ్నర్సుకు పాజిటివ్ నిర్ధారణైంది. బుధవారం కరోనా పాజిటివ్ వచ్చిన జిల్లా ఆసుపత్రిలోని ఉద్యోగి ఇద్దరు పిల్లలకు కూడా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అలాగే శ్రీనివాస్నగర్లోని భార్యభర్తలకు కరోనా పాజిటివ్ నమోదు జరిగింది. పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయనకు పాజిటివ్ రాగా ఖమ్మం చిరునామాతో నమోదు చేశారని వైద్యశాఖ అధికారులు తెలిపారు.