Maharashtra గోదాములో అగ్నిప్రమాదం...8మంది కార్మికులకు గాయాలు

ABN , First Publish Date - 2022-03-18T12:52:45+05:30 IST

మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 8మంది కార్మికులు గాయపడ్డారు...

Maharashtra గోదాములో అగ్నిప్రమాదం...8మంది కార్మికులకు గాయాలు

పూణే: మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 8మంది కార్మికులు గాయపడ్డారు. పూణే సమీపంలోని పింప్రీ చించ్ వాద్ నగరంలోని మోషీ కాంపౌండు స్రాప్ గోదాములో కెమికల్ బారెల్‌లను కార్మికులు శుభ్రం చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో మూసా మొహమ్మద్, పిరాజ్ భోగ్వాద్, మల్లు, మాధవ్, బాలాజీ, సురేష్, మహదు, శివరాజ్ లు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-03-18T12:52:45+05:30 IST