ప్రభుత్వ పాఠశాలలోని ఎనిమిదిమంది చిన్నారులకు కరోనా!

ABN , First Publish Date - 2021-08-14T17:06:41+05:30 IST

పంజాబ్‌లో కరోనా థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలోని ఎనిమిదిమంది చిన్నారులకు కరోనా!

అమృత్‌సర్: పంజాబ్‌లో కరోనా థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అజ్నాలాలోని ప్రభుత్వ సీనియర్ సెకెండరీ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ పాఠశాలలోని విద్యార్థులందరికీ కోవిడ్ టెస్ట్ చేయించగా, ఎనిమిదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 


కరోనా కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో పాఠశాలను 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు విద్యాశాఖాధి కారులు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి విజయ్ ఇందర్ సింగ్లా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, అన్ని స్కూళ్లను మూసివేసే ప్రశ్నేలేదన్నారు. కరోనా కేసులు బయటపడిన పాఠశాలలోని ఉపాధ్యాయులంతా రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నారని తెలిపారు. 

Updated Date - 2021-08-14T17:06:41+05:30 IST