bus accident : పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై ఢీకొన్న బస్సులు...8 మంది మృతి, పలువురికి గాయాలు
ABN , First Publish Date - 2022-07-25T14:49:20+05:30 IST
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...
లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై(Purvanchal expressway) సోమవారం ఉదయం రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు(double-decker private buses) ఒకదానికొకటి ఢీకొనడంతో(collided) 8 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు(several injured).ఈ సంఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్ పూర్ గ్రామ సమీపంలో జరిగింది.రెండు బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు ఢీకొట్టింది.
క్షతగాత్రులను చికిత్స అనంతరం లక్నో ట్రామా సెంటర్కు తరలించారు.బారాబంకి పోలీసు యంత్రాంగం ప్రమాద స్థలానికి చేరుకుంది.పోలీసు ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు.మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) తన ప్రగాఢ సంతాపం తెలిపారు.