కశింకోటలో ఎనిమిది కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-13T05:52:55+05:30 IST
కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ సోకిందని ఎంపీహెచ్ఈవో ఎస్.శ్రీనివాస్ చెప్పారు.
కశింకోట, ఏప్రిల్ 12: కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ సోకిందని ఎంపీహెచ్ఈవో ఎస్.శ్రీనివాస్ చెప్పారు. కశింకోట అగ్రహారంవీధి, అట్టావీధి, హౌసింగ్ కాలనీకి చెందిన ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు, కొత్తూరకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు, మూలపేటకు చెందిన 38 ఏళ్ల పురుషుడు కరోనా బారిన పడ్డారన్నారు. ఈ నెల 10న వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి విశాఖ పంపగా పాజిటివ్ ఉన్నట్టు తేలిందన్నారు. కరోనా సోకిన వారికి సంబంధించిన బంధువులను హోం క్వారంటైన్లో ఉండాలని సూచించినట్టు ఆయన చెప్పారు.
రావికమతంలో ఇద్దరికి..
రావికమతం: మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్తకోట పీహెచ్సీ పరిధిలోని కొత్తకోటకు చెందిన మహిళకు, జడ్కొత్తపట్నంకు చెందిన పురుషుడుకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి మణికుమారి తెలిపారు.