పొగాకు కొనుగోళ్లు పరిశీలించిన ఈడీ
ABN , First Publish Date - 2020-07-04T10:53:14+05:30 IST
పొగాకు బోర్డు నూతన ఈడీ ఆర్.ముత్తరాసన్ శుక్రవారం ఒంగోలు-1 వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు కొనుగోళ్ళను
ఒంగోలు, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు బోర్డు నూతన ఈడీ ఆర్.ముత్తరాసన్ శుక్రవారం ఒంగోలు-1 వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు కొనుగోళ్ళను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. నాలుగైదు రోజుల క్రితం బోర్డు ఈడీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నగరంలోని బోర్డు ఆర్ఎం కార్యాలయానికి వచ్చి రైతుప్రతినిధులతో తా జా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం కేంద్రం అధికారి శ్రీనివాసులునాయుడు, రైతులతో స మావేశమయ్యారు. రైతులకు వేలంలో ఇబ్బందులు రాకుండా బోర్డు త రుపున చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా నోబిడ్ బేళ్లు త గ్గేలా చూస్తామని హామీ ఇచ్చారు. పొగాకు బోర్డు కీలక మండల సభ్యు డు కొండారెడ్డి, పొగాకు బోర్డు ఆక్షన్ మేనేజర్ బాబురావు, విజిలెన్స్ ఓ ఎస్డీ దామోదర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.