ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-02-27T04:53:13+05:30 IST

ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాయత్రిగార్డెన్‌లో ట్రాక్టర్‌ ఓనర్లు, డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 26: ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాయత్రిగార్డెన్‌లో ట్రాక్టర్‌ ఓనర్లు, డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానన్నారు. ట్రాక్టర్లు డ్రైవర్లు, యజమానులు సంఘటితంగా ఉండి సమస్యలసాధన కోసం కృషి చేయాలని కోరారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, పలువురు కౌన్సిలర్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:53:13+05:30 IST