ఆలయాల ఆదాయం పెంపునకు కృషి

ABN , First Publish Date - 2021-06-24T05:41:12+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దేవాలయాల ఆదాయం బాగా తగ్గిపోయిందని, దానిని పెంచేందుకు అంతా కలిసి కృషి చేస్తామని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) పుష్పవర్దన్‌ తెలిపారు.

ఆలయాల ఆదాయం పెంపునకు కృషి
బాధ్యతలు స్వీకరించిన పుష్పవర్దన్‌

దేవదాయ శాఖ డీసీ పుష్పవర్దన్‌

విశాఖపట్నం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దేవాలయాల ఆదాయం బాగా తగ్గిపోయిందని, దానిని పెంచేందుకు అంతా కలిసి కృషి చేస్తామని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) పుష్పవర్దన్‌ తెలిపారు. డీసీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రులు వెల్లంపల్లి, ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారుల సహకారంతో మూడు జిల్లాల్లోని దేవదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షిస్తామన్నారు. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా వాటిని తొలగించి, భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల ఔన్నత్యాన్ని కాపాడతామని చెప్పారు. విశాఖ జిల్లాకు చెందిన సహాయ కమిషనర్లు వినోద్‌కుమార్‌, శాంతి, ఇతర అధికారులు కలిసి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-06-24T05:41:12+05:30 IST