కాపురాల గుట్టను ఎకో పార్కుగా అభివృద్ధికి కృషి : కంచర్ల
ABN , First Publish Date - 2021-01-19T06:04:25+05:30 IST
చారిత్రాత్మకమైన కాపురాల గుట్టను ఎకో పార్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఇందుకు త్వరలో సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు అందిస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నల్లగొండ కల్చరల్, జనవరి 18 : చారిత్రాత్మకమైన కాపురాల గుట్టను ఎకో పార్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఇందుకు త్వరలో సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు అందిస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని కాపురాల గుట్టను కాలినడకన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లతీ్ఫసాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. ఈ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన వెంట మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని, కౌన్సిలర్లు ఉన్నారు.