తిర్మల్రెడ్డి ఆశయ సాధనకు కృషి
ABN , First Publish Date - 2022-05-27T04:48:45+05:30 IST
మాజీ ఎంపీపీ, దివంగత తిర్మల్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దామని టీఆర్ఎస్ నాయకుడు ఉత్తనూర్ గౌతమ్రెడ్డి అన్నారు.
- 28న ఆయన విగ్రహావిష్కరణ
- టీఆర్ఎస్ నాయకుడు ఉత్తనూర్ గౌతమ్రెడ్డి
అయిజ, మే 28 : మాజీ ఎంపీపీ, దివంగత తిర్మల్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దామని టీఆర్ఎస్ నాయకుడు ఉత్తనూర్ గౌతమ్రెడ్డి అన్నారు. అయిజలోని పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిర్మల్రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడని, ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేసిన మనిషి అన్నారు. ఉత్తనూరులో 28వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన విగ్ర హావిష్కరణ, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై వారి సలహాలు, సూచనలు ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమం ఏర్పాట్లపై మాజీ ఎంపీపీ సుందర్రాజ్, కేశవరం సీతారామిరెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు రాముడు, మునిసిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, జడిదొడ్డి సర్పంచు హన్మంతురెడ్డిలతో చర్చించారు. కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్లు సీఎం సురేష్, నర్సింహులు, వెంకటేష్, పావని, భూమ్పూర్ సర్పంచు నీలకంఠరెడ్డి, నాయకులు ఖాజ, బెంజిమె న్, రగస్వామి, మల్లయ్య, చాంద్బాష, శివ, వెంకటేష్, కిశోర్, వెంకటేష్, జోగుళాంబ ఆలయ కమిటీ సభ్యుడు పులికల్ గోవర్ధన్ పాల్గొన్నారు.