టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T06:34:53+05:30 IST
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన టీడీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు, భూదాన్పోచంపల్లి మాజీ ఎంపీపీ బడుగు దానయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మును గోడు నియోజగవర్గ ఇన్చార్జి జక్కల ఐలయ్య కోరారు.
భూదాన్పోచంపల్లి, సంస్థాన్ నారాయణ పురం, మే 24: బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన టీడీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు, భూదాన్పోచంపల్లి మాజీ ఎంపీపీ బడుగు దానయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మును గోడు నియోజగవర్గ ఇన్చార్జి జక్కల ఐలయ్య కోరారు. కోరారు. మంగళవారం భూదాన్పోచంపల్లిలో, సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ భువనగిరి పార్లమెంట్ అధికార ప్రతినిధి గుండ్ల రామచంద్రం ముదిరాజ్, బైరు లక్ష్మయ్య, భారత ఆంజనేయులు, భారత భూషణ్, వనం శంకర్, గంజి కృష్ణ, చిలివేరు గోవర్ధన్ ఏర్పుల సుదర్శన్, మత్యాల విజయ్కుమార్, చంద్రయ్య, బిక్షపతి, ఎట్టయ్య పాల్గొన్నారు.