పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T04:44:48+05:30 IST

కొల్లాపూర్‌ నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు కొల్లాపూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలతో ఎల్లేని సుధాకర్‌రావు

- బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు

పాన్‌గల్‌, మే 19 : కొల్లాపూర్‌ నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు కొల్లాపూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని కొత్తపేట గ్రామం లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వా రికి  కండువాలు  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబో యే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందు కు ప్రతీ ఒక్కరు సైనికుల్లా పని చేసి కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మండల  అధ్యక్షుడు అన్వేష్‌, ఉపాధ్యక్షు డు ముంత వెంకటేష్‌యాదవ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:44:48+05:30 IST