పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-02-28T04:29:26+05:30 IST

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల కమిటీలు పూ ర్తిచేసి పోలింగ్‌బూత్‌ స్థాయి వరకు బలోపే తం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ స భ్యుడు పేరాల శేఖర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
పుష్పగుచ్ఛం అందజేస్తున్న లక్ష్మీనర్సయ్య

పెద్దబజార్‌, ఫిబ్రవరి 27: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల కమిటీలు పూ ర్తిచేసి పోలింగ్‌బూత్‌ స్థాయి వరకు బలోపే తం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ స భ్యుడు పేరాల శేఖర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. గ్రామ సమస్యలపై పూర్తి దృ ష్టిపెట్టాలని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు శిక్షణ ఒక ముఖ్యభాగం, మండలస్థాయి నుంచి జా తీయస్థాయి వరకు శిక్షణ తరగతులు క్రమం తప్పకుండా చేపట్టడం, పార్టీ నిరంతరం నిమగ్నమైందన్నారు. మండలస్థాయి శిక్షణ తరగతులు మార్చి 15లోపు పూర్తిచేయాలని తెలిపా రు. జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మా ట్లాడుతూ.. ఏప్రిల్‌ 6న పార్టీ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రతీపోలింగ్‌బూత్‌లో పా ర్టీ జెండా ఆవిష్కరణ చేయాలని తెలిపారు. సమావేశంలో లోకభూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూ ర్యనారాయణగుప్తా, రాజు, నారాయణ, నరసింహారెడ్డి, శివరాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:29:26+05:30 IST