భూసమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2022-01-20T04:06:49+05:30 IST

భూసమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

భూసమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
అధికారులు, రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌: పెండింగ్‌లో ఉన్న భూసంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో కలిసి భూసమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల పరిధిలో భూసమస్యలపై వచ్చిన ఫిర్యాదులను రైతుల నుంచి స్వీకరించారు. పట్టా పాసుపుస్తకాల్లో పేర్ల తప్పిదాలు, ఇతరత్రా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నా కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:06:49+05:30 IST