ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-06-26T06:38:38+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు.
వేములపల్లి, మాడ్గులపల్లి, జూన 25: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు. శనివారం వేములపల్లి మండలంలోని పాఠశాలలను, మాడ్గులపల్లి కస్తూర్బాగాంధీ పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతను పెంచాలని, వారానికి మూడుసార్లు విధిగా గుడ్లు అందించాలన్నారు. కుక్కడం గ్రామంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న హాస్టల్ గదులను వారంలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈవో బాలాజీనాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెచఎం లక్ష్మణ్నాయక్, హెచఎం ఇంతియాజ్, సైదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.