గామాల అభివృద్ధికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:12:13+05:30 IST

గామాల అభివృద్ధికి కృషిచేయాలి

గామాల అభివృద్ధికి కృషిచేయాలి
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని సన్మానిస్తున్న సర్పంచ్‌ నవనీత జైపాల్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు గౌస్‌

నవాబుపేట, జనవరి 28 : నవాబుపేట మండల పరిధిలోని యత్రాజ్‌పల్లి, చిట్టిగిద్ద గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని యత్రాజ్‌పల్లి గ్రామ సర్పంచ్‌ నవనీత జైపాల్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ గౌస్‌ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని యత్రాజ్‌పల్లి గ్రామ సర్పంచ్‌ నవనీత నివాసంలో విందుకు హాజరుకాగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ సర్పంచ్‌ తెలిపిన విషయాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకుడు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:12:13+05:30 IST