స్వర్ణకారుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2022-01-24T04:22:43+05:30 IST

జిల్లాలో స్వర్ణకారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగభూషణం ఆచారి, ప్రధాన కార్యదర్శి అనీస్‌ అహ్మద్‌ తెలిపారు.

స్వర్ణకారుల సంక్షేమానికి కృషి
అధ్యక్షుడు నాగభూషణంను సన్మానిస్తున్న స్వర్ణకారులు

ప్రమాణ స్వీకారోత్సవంలో అధ్యక్షుడు నాగభూషణం ఆచారి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 23 : జిల్లాలో స్వర్ణకారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగభూషణం ఆచారి, ప్రధాన కార్యదర్శి అనీస్‌ అహ్మద్‌ తెలిపారు. ఆదివారం స్థానిక ముబారక్‌ షాదీ మంజిల్‌లో జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా నాగభూషణం ఆచారి, ప్రధాన కార్యదర్శిగా అనీస్‌ అహ్మద్‌, కోశాధికారి అబ్రార్‌ అహమ్మద్‌లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో చాలామంది స్వర్ణకారులకు సరైన ఉపాధి లేకుండా పోయిందన్నారు. స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వ పాటుపడాలని కోరారు. అనంతరం నాగభూషణం ఆచారిని పలువురు స్వర్ణకారులు సత్కరించారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు శ్రీనివాసాచారి, హిదాయతుల్లా, వడ్ల దాదాపీర్‌, నూకల నాగేశ్వరరావు, అహ్మద్‌ హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సంఘానికి పట్టణ స్వర్ణకారుల అభివృద్ధి సంఘం, స్వర్ణకార సంక్షేమ సంఘం, ముస్లిం స్వర్ణకార సంక్షేమ సంఘాలు మద్దతు తెలిపాయి. 

Updated Date - 2022-01-24T04:22:43+05:30 IST