కాపుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2021-07-28T05:03:08+05:30 IST

కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రగుంట్లనగరపంచాయతీ చైర్మన్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాపుల సంక్షేమానికి కృషి
కాపునేస్తం చెక్కును పంపిణీచేస్తున్న దృశ్యం

ఎర్రగుంట్ల, జూలై 27:కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రగుంట్లనగరపంచాయతీ చైర్మన్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు మంగళవారం  కాపు నేస్తం పథకం కింద 31లబ్దిదారులకు రూ.4,65,000 చెక్కును నగర పంచాయతీ చైర్మన్‌  పంపిణీచేశారు. జగనన్న కాపునేస్తానికి చేస్తున్న ఆర్థిక సహాయన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన  లబ్దిదారులను కోరారు. ఈకార్యక్రమంలో కమిషనర్‌ జగన్నాథ్‌, కౌన్సిలర్లు రషీద్‌, నాగిరెడ్డి, ఆలీ, మెప్మా, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:03:08+05:30 IST