వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-10-27T04:10:57+05:30 IST
వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి
చేవెళ్ల: చేవెళ్ల వ్యవసాయ మార్కె ట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ చైర్పర్సన్ ఎం.శివలీలనర్సింలు అన్నారు. మంగళవారం యార్డులో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చేవెళ్ల యార్డులో కోల్డ్ స్టోరెజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. యార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, కూరగాయల షెడ్ రిపేర్కు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమావేశంలో వైఎస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సభ్యులు నిర్మల, విశ్వనాథం, ఘనీ, ప్రభాకర్రెడ్డి, యాదయ్య, సతీశ్కుమార్, జనార్దన్రెడ్డి, యాదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.