శంభులింగేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-06-26T07:25:42+05:30 IST
మండలంలోని జలాల్పురం గ్రామం లోని శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హైదారాబాద్ సెంట్రల్ దేవాదాయ శాఖ డీఈ రాజేశ్వర్రావు, ఏఈ రాజయ్య స్థపతి రాములు తెలిపారు.
తిరుమలగిరి రూరల్, జూన్ 25: మండలంలోని జలాల్పురం గ్రామం లోని శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హైదారాబాద్ సెంట్రల్ దేవాదాయ శాఖ డీఈ రాజేశ్వర్రావు, ఏఈ రాజయ్య స్థపతి రాములు తెలిపారు. శనివారం దేవాలయ ప్రాంగణంలో విలేకరులతో వారు మాట్లాడారు. సీజీఎఫ్ నిధుల నుంచి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికినిధులను అంచనా వేయడానికి వచ్చామన్నారు.