దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2020-05-23T10:59:48+05:30 IST
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆల్విన్కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటే్షగౌడ్ అన్నారు. కార్పొరేటర్ దొడ్ల
కార్పొరేటర్ వెంకటే్షగౌడ్ జన్మదినం సందర్భంగా నిత్యావసరాల పంపిణీ
హైదర్నగర్, మే 22 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆల్విన్కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటే్షగౌడ్ అన్నారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటే్షగౌడ్ జన్మదినం సందర్భంగా గుర్రం రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడిని చూసి చలించిన కార్పొరేటర్ కంటతడి పెట్టుకున్నాడు.
అతడికి రూ.2వేల ఆర్థిక సాయం చేశారు. డివిజన్ పరిధిలో ఉన్న దివ్యాంగుల సమస్యల గురించి దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో నిత్యావసరాలు, పాలు, గుడ్లు, పౌష్టికాహారం, డైపర్లు అందజేశారు. అనంతరం గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఎల్లమ్మబండ, పీజేఆర్నగర్లో 1200మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా నిత్యావసరాలను డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్, ఎమ్మెల్యే గాంఽధీతో కలిసి కార్పొరేటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబాఫసీయుద్దీన్, ఆరెకపూడి గాంఽధీ కార్పొరేటర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, నాయకులు జిల్లా గణేష్, కాశీనాథ్యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, మున్నా, వెంకటేష్, అర్జున్ పాల్గొన్నారు.